Gujarath Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన ఏఐఎంఐఎం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే స్పష్టం చేసిన ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ...
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే స్పష్టం చేసిన ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా మరో అడుగు ముందుకేశారు. ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జమల్పూర్ నుంచి ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. దానిలిమ్డా అసెంబ్లీ నుంచి కౌశికాపార్మర్, తూర్పు సూరత్ నియోజకవర్గం నుంచి వాసిమ్ ఖురేషి పోటీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సరైన సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు గుజరాత్లో ప్రధానంగా భాజపా, కాంగ్రెస్ మధ్యే పోరు జరిగేది. తాజాగా ఆప్, ఏఐఎంఐఎం కూడా బరిలో దిగుతుండటంతో అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్లీ, పంజాబ్ మాదిరిగా గుజరాత్లోనూ పాగా వేయాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పట్టుదలతో ఉన్నారు. తద్వారా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టే నాయకుడిగా మారాలని భావిస్తున్నారు. వ్యూహంలో భాగంగానే కేజ్రీవాల్ ఇటీవల కాలంలో తరచూ గుజరాత్లో పర్యటిస్తూ ఉచిత విద్య, ఆరోగ్య సేవలు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలతో అక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..