Akhilesh Yadav: కాంగ్రెస్ ఫూల్ చేస్తోంది.. పొత్తుపై ఆలోచిస్తాం !: అఖిలేశ్ యాదవ్
ఇతర పార్టీలను కాంగ్రెస్ ఫూల్ చేస్తోందని, జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తుపై పునరాలోచిస్తామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.
దిల్లీ: ‘ఇండియా’ (India) కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను ఫూల్ చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు పని చేయవని ముందే చెబితే ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉండేవారమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలపడంపై సమాజ్వాదీ పార్టీ పునరాలోచిస్తుందని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
కాంగ్రెస్, ఎస్పీలు జాతీయ స్థాయిలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఈ మేరకు మధ్యప్రదేశ్లోని మొత్తం 29 లోక్సభ నియోజకవర్గాల్లో 18 స్థానాల్లో పరస్పర అంగీకారంతో అభ్యర్థులను నిలిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చకుండా ఉండేందుకే ఆ ఎత్తుగడ వేశాయి. అయితే, తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. నవరాత్రి ప్రారంభం రోజున మధ్యప్రదేశ్లోని 144 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. అదే రోజున 9 మంది అభ్యర్థుల పేర్లను ఎస్పీ వెల్లడించింది. ఇందులో 5 స్థానాల్లో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అంతేకాకుండా బుధవారం రాత్రి ఎస్పీ మరో 22 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో 13 స్థానాల్లో కాంగ్రెస్, ఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్ వైఖరిపై ఎస్పీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జాతీయ స్థాయిలో కూటమిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కూడా అది వర్తింపజేయాలని డిమాండ్ చేస్తోంది. ‘‘ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్తో మాట్లాడాను. పార్టీ పనితీరు గురించి, గతంలో ఎస్పీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల గురించి, అంతేకాకుండా రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాల గురించి ఆయనకు వివరించాను. ఆరు స్థానాల్లో అభ్యర్థులను ఉపసంహరించుకునేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాళ్లు అభ్యర్థులను ప్రకటించే ముందు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. రాష్ట్ర స్థాయిలో కూటమి లేదు అనుకుంటే, జాతీయ స్థాయిలో మేం వాళ్లతో కలిసి ఉండేవాళ్లం కాదు. జాతీయ స్థాయిలో వాళ్లతో పొత్తులో ఉండాలా? లేదా?అన్నదానిపై పునరాలోచిస్తాం. వాళ్లు ఎలా ఉంటారో.. మేం కూడా అలాగే ప్రవర్తిస్తాం’’ అని అఖిలేశ్ యాదవ్ మీడియాకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు