Exit Polls2022: ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కేజ్రీవాల్ రియాక్షన్ ఇదే..
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election2022)తో పాటు దిల్లీ మున్సిపల్ ఎన్నికల(MCD Polls)కు సంబంధించి పలు సర్వే సంస్థలు సోమవారం సాయంత్రం వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్(Exit Polls)పై దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు.
దిల్లీ: గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election2022)తో పాటు దిల్లీ మున్సిపల్ ఎన్నికల(MCD Polls)కు సంబంధించి పలు సర్వే సంస్థలు సోమవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్(Exit Polls) వెల్లడించిన అంచనాలపై ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పందించారు. గుజరాత్లో ఫలితాలు సానుకూలంగానే ఉంటాయన్నారు. అక్కడ తమ పార్టీ కొత్తగా పోటీ చేసిందని.. భాజపాకు కంచుకోటైన గుజరాత్లో తమకు 15 నుంచి 20శాతం ఓట్ల గెలిస్తే రావడమంటే.. చాలా గొప్ప విషయమన్నారు. అయినా ఓట్ల లెక్కింపు రోజు వరకు వేచి చూడాలన్నారు. అయితే, ఆ పార్టీ నేతలు మాత్రం సర్వేలు తప్పని తేలుతుందని.. ఆప్కు దాదాపు 100కు చేరువలో సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు. దిల్లీ పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్స్వీప్ చేయబోతున్నప్పటికీ.. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ది ఫ్లాప్ షోనే అంటూ దాదాపు అన్ని సర్వేలూ ముక్తకంఠంతో పేర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు, దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ భారీ విజయంతో 15ఏళ్ల భాజపా పాలనకు చెక్ పెట్టనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటంపై కేజ్రీవాల్ హర్షం ప్రకటించారు. దిల్లీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. దిల్లీ ఓటర్లు తమ పార్టీపైనే విశ్వాసం ఉంచినట్టు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయన్న ఆయన.. ఈ ఫలితాలనే తాము ఆశిస్తున్నామన్నారు. అసలైన ఫలితాల కోసం (డిసెంబర్ 7) వరకు వేచి చూస్తున్నట్టు చెప్పారు.
గుజరాత్లో కమలదళం 117-151 మధ్య సీట్లు సాధించి ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో చెబుతున్నాయి. భాజపాకు చాలా దూరంలో కాంగ్రెస్ (16-51) రెండో స్థానానికి పరిమితం కానుండగా.. భాజపా పాలనకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన ఆమ్ ఆద్మీ పార్టీకి (2-13)తీవ్ర నిరాశ ఎదురుకానుందని అంచనా వేశాయి. అంతేకాకుడా, ఆప్కు రెండంకెల సీట్లు రావడమూ గగనమేనని పేర్కొన్నాయి. మరోవైపు- హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్తో హోరాహోరీ ఉన్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీని కమలదళం సాధించగలదని ఎక్కువ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేయగా.. అక్కడ ఆప్ ప్రభావం అంతంతమాత్రమేనని పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్