Exit Polls2022: ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కేజ్రీవాల్ రియాక్షన్ ఇదే..
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election2022)తో పాటు దిల్లీ మున్సిపల్ ఎన్నికల(MCD Polls)కు సంబంధించి పలు సర్వే సంస్థలు సోమవారం సాయంత్రం వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్(Exit Polls)పై దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు.
దిల్లీ: గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election2022)తో పాటు దిల్లీ మున్సిపల్ ఎన్నికల(MCD Polls)కు సంబంధించి పలు సర్వే సంస్థలు సోమవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్(Exit Polls) వెల్లడించిన అంచనాలపై ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పందించారు. గుజరాత్లో ఫలితాలు సానుకూలంగానే ఉంటాయన్నారు. అక్కడ తమ పార్టీ కొత్తగా పోటీ చేసిందని.. భాజపాకు కంచుకోటైన గుజరాత్లో తమకు 15 నుంచి 20శాతం ఓట్ల గెలిస్తే రావడమంటే.. చాలా గొప్ప విషయమన్నారు. అయినా ఓట్ల లెక్కింపు రోజు వరకు వేచి చూడాలన్నారు. అయితే, ఆ పార్టీ నేతలు మాత్రం సర్వేలు తప్పని తేలుతుందని.. ఆప్కు దాదాపు 100కు చేరువలో సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు. దిల్లీ పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్స్వీప్ చేయబోతున్నప్పటికీ.. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ది ఫ్లాప్ షోనే అంటూ దాదాపు అన్ని సర్వేలూ ముక్తకంఠంతో పేర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు, దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ భారీ విజయంతో 15ఏళ్ల భాజపా పాలనకు చెక్ పెట్టనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటంపై కేజ్రీవాల్ హర్షం ప్రకటించారు. దిల్లీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. దిల్లీ ఓటర్లు తమ పార్టీపైనే విశ్వాసం ఉంచినట్టు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయన్న ఆయన.. ఈ ఫలితాలనే తాము ఆశిస్తున్నామన్నారు. అసలైన ఫలితాల కోసం (డిసెంబర్ 7) వరకు వేచి చూస్తున్నట్టు చెప్పారు.
గుజరాత్లో కమలదళం 117-151 మధ్య సీట్లు సాధించి ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో చెబుతున్నాయి. భాజపాకు చాలా దూరంలో కాంగ్రెస్ (16-51) రెండో స్థానానికి పరిమితం కానుండగా.. భాజపా పాలనకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన ఆమ్ ఆద్మీ పార్టీకి (2-13)తీవ్ర నిరాశ ఎదురుకానుందని అంచనా వేశాయి. అంతేకాకుడా, ఆప్కు రెండంకెల సీట్లు రావడమూ గగనమేనని పేర్కొన్నాయి. మరోవైపు- హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్తో హోరాహోరీ ఉన్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీని కమలదళం సాధించగలదని ఎక్కువ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేయగా.. అక్కడ ఆప్ ప్రభావం అంతంతమాత్రమేనని పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
సూత్రధారులపై చర్యలు తీసుకోండి
తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్ అధికారులను కోరారు. -
అప్పుడు లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చింది?: తెదేపా
విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలట్ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. -
పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు. -
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్ఛైర్మన్ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
మమత గురించి ఖర్గే చెప్పినా వినను: అధీర్
మమతా బెనర్జీ విషయంలో సంయమనం పాటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చెబుతున్నా అంగీకరించేది లేదని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి తేల్చిచెప్పారు. -
పెద్దలను మోదీ అలా అనొచ్చా!
లోక్సభ ఎన్నికల తరవాత విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందులోని మిత్రపక్షమైన ఆప్ దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు యత్నిస్తుందని భాజపా ఆందోళనలో ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
సుస్థిర విధానాలతో సుసంపన్న భారత్
ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే దేశ ఆర్థిక రంగం ఒడుదొడుకులకు గురవుతుందని, స్టాక్ మార్కెట్లు పతనమవుతాయంటూ భాజపా నేతలు మదుపరుల్లో భయాందోళనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. -
రాహుల్, అఖిలేశ్ సభలో తొక్కిసలాట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. -
రాహుల్ నోట మావోయిస్టుల భాష.. వాళ్లొస్తే పెట్టుబడులు రావు
బలవంతపు ధన సమీకరణ వంటి కొత్త పద్ధతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ యువరాజు (రాహుల్గాంధీని ఉద్దేశించి) మావోయిస్టుల భాష వింటే ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. -
‘కళింగ’ కదన కుతూహలం!
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కళింగ గడ్డ ఒడిశాలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. నేడు 5 లోక్సభ సీట్లు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంక్షిప్త వార్తలు
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. -
రాష్ట్రానికి మోదీ చేసింది ఏమీలేదు..
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. -
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
కేంద్రంలోని భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కాషాయ పార్టీ యూపీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అవుతుందన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..