బినామీల పేరుతో మంత్రి భూ దందా: అయ్యన్న

కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన భూములను తప్పుడు పత్రాలు సమర్పించి తన బంధువులు, బినామీల పేరిట మంత్రి జయరాం రాయించుకున్నారని

Published : 07 Oct 2020 02:38 IST

విశాఖపట్నం: కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన భూములను తప్పుడు పత్రాలు సమర్పించి తన బంధువులు, బినామీల పేరిట మంత్రి జయరాం రాయించుకున్నారని తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ సంస్థ నుంచి 2009లోనే బయటకొచ్చిన మంజునాథ్‌ అనే వ్యక్తి తప్పుడు పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలు సమర్పించి వందల ఎకరాల భూమిని అతని పేరుమీద, ఆ తర్వాత మంత్రి బంధువులకు విక్రయించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
 ఆ భూమిపై కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకులో రుణం పొందేందుకు యత్నించారన్నారు. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కర్ణాటకలో కేసు కూడా నమోదైందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టులో కేసు ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి జయరాం భూ దందాకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రైవేటు కంపెనీ నుంచి మంత్రి జయరాం భూములు లాక్కున్నట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని