Purandeswari: అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులు జగన్‌కు కనిపించట్లేదా..?: పురందేశ్వరి

ఎన్నికలకు ముందు రైతులకు జగన్‌ అనేక హామీలు ఇచ్చి విస్మరించారని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు

Updated : 07 Nov 2023 13:51 IST

అనంతపురం: ఎన్నికలకు ముందు రైతులకు సీఎం జగన్‌ అనేక హామీలు ఇచ్చి విస్మరించారని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. అనంతపురంలో ఆమె పర్యటించారు. పుట్టపర్తిలో సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులు జగన్‌కు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. ఇవాళ బటన్లు నొక్కుతూ రైతులు, ప్రజలను ఆయన మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సాగు, తాగునీరు అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాట ఏమైందని ఆమె నిలదీశారు. శీతల గోదాముల ఏర్పాటుపై అడుగు కూడా ముందుకు పడలేదని పురందేశ్వరి విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని