Telangana News: ద్రౌపదీ ముర్మూ.. తల్లిగా దేశానికి సేవ చేస్తారు: బండి సంజయ్‌

ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అవుతారని ఎవరూ ఊహించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ద్రౌపదీ ముర్మూ తల్లిగా భారతదేశానికి సేవ చేస్తారనే నమ్మకం ఉందన్నారు.

Published : 24 Jun 2022 14:32 IST

హైదరాబాద్: ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అవుతారని ఎవరూ ఊహించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ద్రౌపదీ ముర్మూ తల్లిగా భారతదేశానికి సేవ చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా భాజపా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద థింసా నృత్యాలు చేస్తూ బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులను రాష్ట్రపతి చేసిన ఘనత భాజపాకే దక్కుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు మోదీ ప్రభుత్వం సముచిత న్యాయం చేస్తుందని చెప్పారు. ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన నరేంద్ర మోదీ, నడ్డా, అమిత్ షాకు తెలంగాణ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జులై 3న జరిగే బహిరంగ సభకు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని.. మోదీకి అండగా నిలవాలని బండి సంజయ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని