ఫోన్ల ట్యాపింగ్:సీబీఐ విచారణకు భాజపా డిమాండ్
రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో టేపులు నకిలీవని భాజపా ఆరోపించింది. తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కాంగ్రెస్........
జైపుర్: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో టేపులు నకిలీవని భాజపా ఆరోపించింది. తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కాంగ్రెస్ ఈ కుట్రకు తెరతీసిందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. అలాగే రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందో.. లేదో.. ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చేస్తే.. నిబంధనల్ని పాటించారా అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేడు దిల్లీలోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ఆయన కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్లో గత కొంత కాలంగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని సంబిత్ పాత్రా ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి గహ్లోతే గత కొన్ని రోజులుగా ఉపముంఖ్యమంత్రిగా కొనసాగిన సచిన్ పైలట్తో మాటలు లేవని చెప్పడమే దానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్కు ఫోన్ ట్యాపింగ్ చేసే చరిత్ర ఎప్పటి నుంచో ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆరు ప్రశ్నలు సంధించారు.
1. రాజస్థాన్ అధికార యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ చేసిందా?
2. ఫోన్ ట్యాపింగ్ అనే అంశం సున్నితమైంది.. చట్టపరమైంది కాదా?
3.ఫోన్ ట్యాపింగ్ చేయడానికి చట్టపరంగా పాటించాల్సిన నిబంధనల్ని పాటించారా?
4. రాష్ట్రంలోని అందరి నాయకులపై ప్రభుత్వం నిఘా ఉంచిందా?
5. రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారా?
6. కాంగ్రెస్ పార్టీ చట్టాల్ని విస్మరించిందా? అని భాజపా.. అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అంతకుముందు ఆడియో టేపుల విషయంలో భాజపా నేత లక్ష్మీకాంత్ భరద్వాజ్.. కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సూర్జేవాలా, గోవింద్ సింగ్ దోస్తారాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఆడియో టేపుల్లో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ను అకారణంగా కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిరోజు మహేశ్ జోషి, సూర్జేవాలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రభుత్వ వైఫల్యాల్ని భాజపాపైకి నెట్టివేయడానికే ఇలాంటి కుట్రకు తెరతీశారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్