ఏ మొహం పెట్టుకొని రాహుల్ ఓయూకి వద్దామనుకున్నారు?: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి ఏదో చేస్తాడన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హడావిడి చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
హైదరాబాద్: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి ఏదో చేస్తాడన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హడావిడి చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రైతుల కోసం డిక్లరేషన్ తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని.. దేశంలో రైతాంగానికి కాంగ్రెస్ చేసింది శూన్యమని ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ హయాంలో కనీస మద్దతు ధర కల్పించలేకపోయారు. ప్రధాని మోదీ పాలనలో పంటలకు మద్దతు ధర పెరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం ఇస్తోంది. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు.. రాహుల్ గాంధీకి అసలే లేదు. రైతు సంఘర్షణ సభ కాకుండా కాంగ్రెస్ సభ అని పేరు పెట్టుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)కి రాహుల్గాంధీ ఏ ముఖం పెట్టుకొని వద్దామనుకుంటున్నారు?తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం.
ఇదంతా తెరాస- కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. వరంగల్ సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఎలా ఇస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి నిరుద్యోగ యువత గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటం ఆడటం మంచిది కాదు. రాహుల్ గాంధీని కలిసి విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన డైయింగ్ డిక్లరేషన్ అందజేస్తా. ఈ నెల 5న మహబూబ్నగర్లో జరిగే బహిరంగ సభకు జేపీ నడ్డా రానున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అమిత్షా వస్తున్నారు’’ అని ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..