BJP: పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు: డీకే అరుణ
తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించి.. సెంటిమెంట్ రగిలించి సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించి.. సెంటిమెంట్ రగిలించి సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇందిరా పార్క్ వద్ద భాజపా చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని.. బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని డీకే అరుణ హెచ్చరించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారని విమర్శించారు.
ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం భాజపాదే: అర్వింద్
దీక్షలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్.. భారాస సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘‘ భారాస పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లో క్లారిటీ ఉండదు. ఉన్నా.. పరీక్ష సరిగ్గా నిర్వహించరు. నిర్వహించినా.. పేపర్ లీక్ చేస్తారు. కేంద్రం పరీక్ష పెట్టినప్పుడే.. కేసీఆర్ ఇక్కడ పరీక్షలు పెడుతున్నారు. నిరుద్యోగులే పరీక్షలు వాయిదా వేయాలని అడిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది కేసీఆర్ తెలివి. అందుకే నేను ముందుండి పోరాడుతున్నా. బిడ్డను ఓడించా.. కేసీఆర్ను కూడా గద్దె దింపుతా. ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం భాజపాదే. కేంద్రంలో మాములు బుర్రలు లేవు’’ అని అర్వింద్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!