Congress: కాంగ్రెస్‌లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు

భారాస నేతలు, 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరినట్టు చంపాపేట డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి తెలిపారు. 

Published : 27 Mar 2024 22:31 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చడం వల్లే తనతో పాటు భారాస నేతలు, 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరినట్టు చంపాపేట డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. పట్నం మహేందర్‌రెడ్డి, మధుయాష్కీ, జక్కిడి ప్రభాకర్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రమణారెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని