Bypoll results: ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు.. రెండు చోట్ల భాజపా విజయం
గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్ 5న ఒక లోక్సభ స్థానానికి, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తర్ప్రదేశ్లోని మొయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ విజయం సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్ 5న ఒక లోక్సభ స్థానానికి, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తర్ప్రదేశ్లోని మొయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ విజయం సాధించారు. యూపీలోని ఒక చోట, బిహార్లో ఒక చోట అధికార పార్టీలకు షాక్ ఇస్తూ విపక్ష పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఆరు స్థానాల్లో రెండు స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. మిగిలిన చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందారు.
- ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మొయిన్పురి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో సమాజ్వాదీ పార్టీ కంచుకోటగా పేర్కొనే ఈ స్థానంలో డింపుల్ యాదవ్ బరిలో దిగారు. ఈ స్థానంలో 64 శాతం ఓటింగ్తో 6.17 లక్షల ఓట్లు సాధించారు. దాదాపు 2.90 మెజారిటీతో ఆమె విజయం సాధించారు.
- భాజపా అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ శాసనసభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఆకాశ్ సక్సేనా విజయం సాధించారు. ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై 34 వేల ఓట్లతో గెలుపొందారు.
- యూపీలోని ఖతౌలీ స్థానంలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీ అభ్యర్థి మదన్ భయ్యా విజయం సాధించారు. భాజపా అభ్యర్థిపై 22 వేల ఓట్లతో గెలుపొందారు.
- జేడీయూ-ఆర్జేడీ కూటమి అధికారంలో ఉన్న బిహార్లోని కుర్హానీ ఉప ఎన్నిక ఫలితాల్లో భాజపా అభ్యర్థి కేదార్ గుప్తా విజయం సాధించారు. జేడీయూ అభ్యర్థిపై 3 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
- కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మండి విజయం సాధించారు. భాజపా అభ్యర్థిపై దాదాపు 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- ఒడిశాలోని పదంపూర్లో బిజు జనతా దళ్ అభ్యర్థి బర్శా సింగ్ 40 వేల ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై గెలుపొందారు. ఇక్కడ బిజద అధికారంలో ఉంది.
- కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లోని సర్దార్షహర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ భాజపా అభ్యర్థిపై దాదాపు 25 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..