Chandrababu: వివేకా హత్యకేసులో సీఎం జగన్ అడ్డంగా దొరికిపోయారు: చంద్రబాబు
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు తెదేపా కండువా కప్పి అధినేత చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్పై మండిపడ్డారు.
మంగళగిరి: అమరావతి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా (BJP)ను వీడి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తెలుగుదేశం (TDP) పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. కన్నాకు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. జగన్ (CM Jagan) పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు. పంటలకు గిట్టుబాటు ధర లభించట్లేదు. విద్యారంగంలో ఏపీ 19వ స్థానానికి దిగజారింది. రాష్ట్రంలో సంక్షేమం అడ్రస్ లేకుండా పోయింది. కార్పొరేషన్లన్నీ మూసివేసే పరిస్థితి వచ్చింది. గ్రామీణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది’’ అని జగన్ సర్కార్పై చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఆర్థిక ఉగ్రవాది జగన్..
‘‘రాష్ట్ర సంపదంతా తన వద్దే ఉండాలనే ఆర్థిక ఉగ్రవాది జగన్. అందరూ బానిస జీవితం గడపాలనేది ఆయన ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు పేదలయ్యారు.. జగన్ ధనవంతుడవుతూనే ఉన్నారు. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం విక్రయిస్తున్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజలను దోచుకుంటున్నారు. గత సీఎంలలో కొందరు అవినీతిపరులు, మరికొందరు అసమర్థులు ఉన్నారు. కానీ, జగన్ మాదిరి విధ్వంసం చేసిన వారు మాత్రం లేరు. ఏ సీఎం అయినా మంచిపేరు తెచ్చుకునేందుకు తపిస్తారే తప్ప.. జగన్లా వ్యవస్థలపై దాడులు చేయరు. సమావేశాలు పెట్టకూడదని జీవో నంబర్ 1 తీసుకువచ్చారు. అనపర్తిలో సమావేశం పెట్టినప్పుడు అడ్డంకులు సృష్టించారు. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మేం తలచుకుంటే పాదయాత్రలు చేసేవారా? జగన్ చెప్పినట్లు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోంది.
జగన్ ఆడిన నాటకం ఎవరి ఊహకు అందదు..
వివేకా హత్య కేసులో.. హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని సీబీఐ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. కడప ఎంపీ అవినాష్రెడ్డి ఇంట్లోనే హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది. బాబాయ్ను చంపిన విధానం ఎవరూ ఊహించరు. ఈ కేసులో జగన్ గూగుల్ టేక్ అవుట్లో అడ్డంగా దొరికారు. తప్పు చేసి ఇతరులపై నెట్టివేయాలని చూశారు. బాబాయ్ను చంపాక ఆనాడు జగన్ ఆడిన నాటకం ఎవరి ఊహకు అందదు. ఇలాంటి జగన్ నాటకాలు నమ్మి నరహంతకుడికి ప్రజలు ఓట్లేశారు. ఈరోజు వారి ప్రాణాలకే రక్షణ లేకుండాపోయింది. రాష్ట్రంలో ఐపీసీ చట్టం లేదు.. వైకాపా చట్టం ఉంది. పేటీఎం బ్యాచ్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. జగన్ కోసం అధికారులు బలిపశువులు కావొద్దు. పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలను చైతన్యం చేసే దిశగా ముందుకు వెళ్తా. దీనికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా కదిలి రావాలి. మధ్యంతర ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ను ఇంటికి సాగనంపాలి. అందరూ సమష్టిగా ముందుకెళ్లి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు