Chandrababu: కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100ల ప్రత్యేక నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్రానికి, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

Updated : 28 Mar 2023 22:15 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100ల ప్రత్యేక నాణెం విడుదల చేసే అంశంపై ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారత ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో ధన్యవాదాలు తెలుపుతోందని లేఖలో పేర్కొన్నారు.

‘‘నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశం మీ నిర్ణయాన్ని స్వాగతించింది. నాణేన్ని విడుదల చేయడానికి 2023 మార్చి 20న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినందుకు మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పొలిట్‌ బ్యూరో తీర్మానం చేసింది. ఎన్టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఎన్టీఆర్‌ని సన్మానించడమంటే తెలుగు వారిని గౌరవించడమే. ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అని లేఖలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని