Cm Kcr: విద్యావ్యవస్థలో దిల్లీ తరహా విధానాలు దేశానికి అవసరం: సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కేసీఆర్ భేటీ అయ్యారు. కేజ్రీవాల్తో కలిసి కేసీఆర్ దిల్లీలోని మోతీబాగ్లో
దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కేసీఆర్ భేటీ అయ్యారు. కేజ్రీవాల్తో కలిసి కేసీఆర్ దిల్లీలోని మోతీబాగ్లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. సీఎం కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కేసీఆర్కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి దిల్లీ పాఠశాలను చూసేందుకు రావడం ఎంతో సంతోషం. ఆయన పర్యటనను మేం గౌరవంగా భావిస్తున్నాం. పాఠశాల మొత్తం చూపించాం. ఎన్నో ప్రశ్నలు అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు విద్యాశాఖపై చాలా ఆసక్తి ఉంది. తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు. ఇక్కడ ప్రగతి సాధిస్తున్న విషయాలు తెలుసుకునేందుకు కేసీఆర్ దిల్లీ వచ్చారు. తెలంగాణను చూసి మేం కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. పరస్పర అవగాహనతో నేర్చుకుంటే దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ మాట్లాడేతూ.. ‘‘దిల్లీలో విద్యా వ్యవస్థ చాలా బాగుంది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య, మార్కులు.. ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ అద్భుతంగా ఉంది. భారత్లో మరెక్కడా ఇలాంటి విద్యా విధానం లేదు. దిల్లీలో పిల్లలను చదివించటంలో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. దిల్లీ ప్రజలు అదృష్టవంతులు. కేజ్రీవాల్ దిల్లీలో అమలు చేస్తున్న విధానాలపై చర్చించాలి. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బాగుంది. విద్యా వ్యవస్థలో ఇలాంటి విధానాలు పాటించడం మన దేశానికి చాలా అవసరం. తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం. తెలంగాణ నుంచి త్వరలో అధికారుల బృందాన్ని పంపించి సమన్వయం చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఏకపక్షంగా ఉండరాదు. ప్రజాస్వామ్య దేశంలో చర్చలు, సంప్రదింపులు ఉండాలి. విద్యా విధానం దేశానికి అవసరమే... కానీ, ఒకరు రూపొందించి అందర్నీ అమలు చేయాలనడం సరికాదు. కేంద్రం కొత్త విధానాలు తీసుకురావొచ్చు. అవి అమలు చేసే ముందు అన్ని రాష్ట్రాలతో చర్చించి, అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇబ్బందులు తప్పవు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..