PM Modi: కాంగ్రెస్కు అజెండా లేదు.. నాపై బురదజల్లడమే పని: ప్రధాని మోదీ
దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అజెండా లేదని ప్రధాని మోదీ విమర్శించారు.
నవసారీ: కాంగ్రెస్ (Congress) పార్టీకి తనను దూషించడం మినహా మరో అజెండా లేదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దీనివల్ల భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి లోక్సభ ఎన్నికల్లో (LokSabha Elections 2024) 400 సీట్లు గెలవాలనే సంకల్పం మరింత బలపడుతుందన్నారు. గుజరాత్ (Gujarat) పర్యటనలో భాగంగా నవసారీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్పై విమర్శలు చేశారు.
‘‘నన్ను కులం పేరుతో దూషించడం, నాపై ఆరోపణలు చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్లకి మరో పని లేదు. వాళ్లు నాపై ఎంత బురద జల్లితే అందులోంచి 370కి పైగా కమలాలు (లోక్సభ స్థానాలు) వికసిస్తాయి. మోదీని విమర్శించడం మినహా దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీకి ఎలాంటి అజెండా లేదు. బంధుప్రీతి, బుజ్జగింపులు, అవినీతి రాజకీయాలు లక్ష్యంగా మారినప్పుడు దేశ వారసత్వాన్ని కాపాడుకోలేరు’’ అని ప్రధాని విమర్శించారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం దేశంలో నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించిందని తెలిపారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్ట్లను జాతికి అంకితం చేశారు.
రైతుల నిరసనల వేళ.. మోదీ పోస్టు
అంతకుముందు గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. జీసీఎమ్ఎమ్ఎఫ్ను ప్రపంచంలోనే నంబర్వన్గా మార్చేందుకు కృషి చేయాలని రైతులు, వాటాదారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న జీసీఎమ్ఎమ్ఎఫ్ ‘అమూల్’ (Amul) బ్రాండ్ పేరుతో పాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ డెయిరీ రంగం రెండు శాతం వృద్ధి నమోదు చేస్తుంటే.. భారత డెయిరీ రంగం ఆరు శాతం వృద్ధిని సాధిస్తోందని ప్రధాని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ