Kadiyam Srihari: కడియం నివాసానికి కాంగ్రెస్‌ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే

వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

Published : 29 Mar 2024 15:46 IST

హైదరాబాద్‌: వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కడియం కుమార్తె, వరంగల్‌ భారాస ఎంపీ అభ్యర్థి కావ్య పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించగా.. శ్రీహరి పార్టీని వీడుతున్నట్టు స్పష్టమైంది. 

ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు కడియంతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, రోహిత్‌ చౌదరి, మల్లు రవి, సంపత్‌కుమార్, రోహిన్‌రెడ్డి తదితరులు కడియం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై చర్చించిన నేతలు.. కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఏఐసీసీ ఆదేశాలమేరకే పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చినట్టు దీపాదాస్‌ మున్షి తెలిపారు. కార్యకర్తలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని కడియం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని