Revanthreddy: 8కోట్ల గోనె సంచులకు టెండర్లు వేసే దిక్కులేదు: రేవంత్రెడ్డి
అకాల వర్షాల కారణంగా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
నాగార్జునసాగర్: అకాల వర్షాల కారణంగా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. వర్షానికి పంట తడిసిపోకుండా కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మే 6న వరంగల్లో నిర్వహించనున్న రాహుల్గాంధీ సభ కోసం నాగార్జున సాగర్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డితో కలిసి రేవంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రైతులను ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. 7వేల ఐకేపీ కేంద్రాలు తెరవాల్సి ఉంటే.. 2,300 మాత్రమే తెరిచారు. రాష్ట్రంలో 15కోట్ల గోనె సంచుల అవసరముంది. 8 కోట్ల గోనె సంచులకు టెండర్లు పిలిస్తే.. టెండరు వేసే దిక్కులేదు. సిరిసిల్ల, సిద్దిపేటలో అకాల వర్షాల కారణంగా లక్షలాది క్వింటాళ్ల పంట కల్లాల్లో తడిసి మొలకెత్తుతుంటే కనీసం పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కల్లాల్లో తడిసిన ధాన్యానికి రూ.1,960 గిట్టుబాటు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’’ అని రేవంత్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్