Ghulam Nabi Azad: భాజపా గూటికి ఆజాద్ మేనల్లుడు
కాంగ్రెస్ పార్టీకి జమ్మూ కశ్మీర్లో గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో మరో కీలక నేత భాజపా తీర్థం పుచ్చుకున్నారు.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ అసమ్మతి నేత గులాబ్ నబీ ఆజాద్ మేనల్లుడు ముబషిర్ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో చేరారు. జమ్మూ కశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై భాజపాలో చేరినట్లు ముబషిర్ తెలిపారు. పార్టీ మారడం గురించి తన మామయ్య ఆజాద్తో చర్చించలేదన్నారు. ముబషిర్, ఆయన అనుచరులను జమ్మూ కశ్మీర్ భాజపా పార్టీ అధ్యక్షుడు రవీందర్ రైనా పార్టీలోకి ఆహ్వానించారు. ముబషిర్ పార్టీలో చేరడం ద్వారా దోడా, కిష్త్వార్, రంబాన్ జిల్లాలోని మరింత మంది యువత భాజపాలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారని రవీందర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలతోపాటు అన్ని వర్గాల నాయకులు, సామాజిక కార్యకర్తలు భాజపాలో చేరుతున్నారని, వీరితో జమ్మూ కశ్మీర్లో పార్టీ మరింత బలపడుతుందనే ఆశాభావాన్ని రవీందర్ వ్యక్తం చేశారు.
‘‘క్షేత్రస్థాయిలో మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రామాలు చేపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది’’ అని ముబషిర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆజాద్ సేవలను ప్రశసించారని గుర్తుచేశారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పు అవసరమంటూ ఎత్తిచూపిన 23 మంది (జి-23) నేతల్లో ఆజాద్ కూడా ఉన్నారు. ఈ పరిణామాల తర్వాత ఆజాద్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం, ఆజాద్కు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం కాంగ్రెస్కు మింగుడుపడని చర్యలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..