Telangana News: అశోక హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల ‘ప్రత్యేక’ భేటీ
నగరంలోని అశోక హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు
హైదరాబాద్: నగరంలోని అశోక హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు అక్కడికి చేరుకున్నారు. సీనియర్ నేతలు మర్రి శశిధర్రెడ్డి, వీహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, శ్యామ్మోహన్ రావు, కమలాకర్రావు తదితరులు అశోక హోటల్కు వచ్చారు. ఈ సమావేశానికి హాజరుకావాలని వీహెచ్ కొందరు నేతలను ఆహ్వానించారు.
మరోవైపు పార్టీ సూచనలకు వ్యతిరేకంగా ఈ సమావేశం వద్దని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం నేతలకు సూచించింది. వీహెచ్ సహా మరికొందరు సీనియర్లతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఫోన్లో మాట్లాడారు. పార్టీలో సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇలా సమావేశాలు ఏర్పాటు చేస్తే పార్టీకి వ్యతిరేకమనే భావన ప్రజల్లోకి వెళ్తుందని.. అది రావొద్దని కోరారు. అయినప్పటికీ సీనియర్ నేతలు వెనక్కి తగ్గకుండా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న సమస్యలపై అధిష్ఠానం తమతో చర్చలు జరపాలని కోరుతున్నారు.
సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలు అధిష్ఠానానికి తెలియజేయడమే లక్ష్యంగా ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము చేస్తున్నదాంట్లో తప్పేమీ లేదని.. పంజాబ్ తరహాలో పార్టీ నష్టపోవద్దనేదే ఉద్దేశమని చెప్పారు. పూర్తిగా నష్టం జరిగాక చర్చించుకుంటే లాభం ఉండదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..