Telangana News: అశోక హోటల్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ల ‘ప్రత్యేక’ భేటీ

నగరంలోని అశోక హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు

Updated : 20 Mar 2022 13:27 IST

హైదరాబాద్‌: నగరంలోని అశోక హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అక్కడికి చేరుకున్నారు. సీనియర్‌ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, వీహెచ్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, శ్యామ్‌మోహన్‌ రావు, కమలాకర్‌రావు తదితరులు అశోక హోటల్‌కు వచ్చారు. ఈ సమావేశానికి హాజరుకావాలని వీహెచ్‌ కొందరు నేతలను ఆహ్వానించారు. 

మరోవైపు పార్టీ సూచనలకు వ్యతిరేకంగా ఈ సమావేశం వద్దని ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానం నేతలకు సూచించింది. వీహెచ్‌ సహా మరికొందరు సీనియర్లతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఫోన్‌లో మాట్లాడారు. పార్టీలో సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇలా సమావేశాలు ఏర్పాటు చేస్తే పార్టీకి వ్యతిరేకమనే భావన ప్రజల్లోకి వెళ్తుందని.. అది రావొద్దని కోరారు. అయినప్పటికీ సీనియర్‌ నేతలు వెనక్కి తగ్గకుండా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్న సమస్యలపై అధిష్ఠానం తమతో చర్చలు జరపాలని కోరుతున్నారు. 

సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలు అధిష్ఠానానికి తెలియజేయడమే లక్ష్యంగా ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము చేస్తున్నదాంట్లో తప్పేమీ లేదని.. పంజాబ్‌ తరహాలో పార్టీ నష్టపోవద్దనేదే ఉద్దేశమని చెప్పారు. పూర్తిగా నష్టం జరిగాక చర్చించుకుంటే లాభం ఉండదన్నారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని