Himachal Pradesh: విజయం సరే.. ఇప్పుడు కాంగ్రెస్ ముందు ‘సీఎం’ సవాల్..!
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు పార్టీ కొత్త ఎమ్మెల్యేలతో నేడు సమావేశం నిర్వహించనుంది.
శిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ (Congress) పార్టీ ఇప్పుడు తదుపరి సవాల్ను పరిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అదే.. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం. ఈ పదవికి ఆశావహుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ సిద్ధాంతాలకు లోబడి పార్టీని, రాష్ట్రాన్ని ముందు నడిపించే వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెట్టడం హస్తం పార్టీకి పెద్ద సవాలే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎవరి అంచనాలు వారివే..
హిమాచల్లో ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్లో అనేకమంది నేతలు ఆశిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ (Pratibha Singh) (దివంగత మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య, మండీ ఎంపీ), కాంగ్రెస్ ప్రచార కమిటీ అధిపతి సుఖ్వీందర్ సింగ్ సుఖు, మాజీ విపక్షనేత ముఖేశ్ అగ్నిహోత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాఠోడ్, ఠాకుర్ కౌల్సింగ్, ఆశాకుమారి, హర్షవర్ధన్ చౌహన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీఎం పదవికి తాము అర్హులమేనంటూ ఎవరికి వారే ప్రచారం చేసుకుంటుండటం కాంగ్రెస్ను ఇరుకున పెడుతోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో విడిపోయిన పార్టీని తిరిగి ఏకం చేసేందుకు తాను ఎంతగానో కృషి చేశానని కుల్దీప్ సింగ్ చెబుతున్నారు.
తమను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారన్న ఆశతోనే చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పోటీ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల సమయంలో చాలా మంది అభ్యర్థులు ఈ విషయాన్ని తమ ప్రచారానికి వాడుకున్నారు. దీనిపై అప్పట్లో భాజపా విమర్శలు చేసింది కూడా..!
సీఎం బాధ్యతలకు సిద్ధమే: ప్రతిభా సింగ్
ముఖ్యమంత్రి రేసులో దివంగత మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ పదవికి తాను అర్హురాలినేనని ఆమె కూడా ప్రకటించారు. ‘‘ఎన్నికల ముందు రాష్ట్రంలో పార్టీకి నాయకత్వం వహించే బాధ్యతను సోనియాజీ, కాంగ్రెస్ హైకమాండ్ నాకు అప్పగించింది. దాన్ని నేను విజయవంతంగా నిర్వర్తించాను. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కూడా నడిపించగలననే విశ్వాసం ఉంది. పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా నాకు ఉంది’’ అని ప్రతిభా సింగ్ మీడియాకు వెల్లడించారు. అటు వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ తాజా ఎన్నికల్లో శిమ్లా రూరల్ నుంచి విజయం సాధించారు. సీఎం ఎంపిక విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఓ కొడుకుగా తన తల్లికి పెద్ద బాధ్యత రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తామని తెలిపారు.
కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ శుక్రవారం సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అప్పగిస్తూ వారంతా శిమ్లాలో ఏకవాక్య తీర్మానం చేయనున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో వస్తోన్న సంప్రదాయం. ఖర్గే అధికారికంగా శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..