Covid Toolkit: ఇద్దరు కాంగ్రెస్ నేతలకు నోటీసులు
కొవిడ్ టూల్కిట్ వ్యవహారంలో సామాజిక మాధ్యమం ట్విటర్కు శనివారం నోటీసులు పంపిన దిల్లీ పోలీసులు తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలకు సైతం నోటీసులు జారీ చేశారు. భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర నకిలీ ‘కొవిడ్ టూల్కిట్’ను షేర్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు రాజీవ్ గౌడ, రోహన్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దిల్లీ: కొవిడ్ టూల్కిట్ వ్యవహారంలో సామాజిక మాధ్యమం ట్విటర్కు శనివారం నోటీసులు పంపిన దిల్లీ పోలీసులు తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలకు సైతం నోటీసులు జారీ చేశారు. భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర నకిలీ ‘కొవిడ్ టూల్కిట్’ను షేర్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు రాజీవ్ గౌడ, రోహన్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దర్యాప్తునకు సహకరించాలని, స్టేట్మెంట్ రికార్డు చేసేందుకోసం రావాలని దిల్లీ పోలీసులు వారిరువురికి నోటీసులు పంపారు. కాగా దిల్లీ పోలీసుల విచారణకు తాము హాజరుకాబోమని.. తాము ఛత్తీస్గఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈ వ్యవహారాన్ని అక్కడే తేల్చుకుంటామని రాజీవ్ గౌడ వెల్లడించారు.
భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఇటీవల ‘కొవిడ్ టూల్కిట్’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ను ‘వక్రీకరణ’గా ట్విటర్ ఇటీవల వర్గీకరించింది. ఈ వ్యవహారంలోనే ట్విటర్ ఇండియాకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు పంపారు. ఈ అంశంపై సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు. అయితే ట్విటర్ ఇండియా ఎండీ ఇచ్చిన సమాధానాలు గందరగోళంగా ఉండటంతో దిల్లీ పోలీసులు సోమవారం దిల్లీ, గురుగ్రామ్లోని ట్విటర్ కార్యాలయాలకు వెళ్లి దర్యాప్తు జరిపారు. ఈ కొవిడ్ టూల్కిట్ వ్యవహారంపై భాజపా, కాంగ్రెస్ పరస్పరం ఘాటుగా విమర్శించుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..