Daggubati Purandeswari: ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు.. ప్రభంజనం: పురందేశ్వరి

నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని.. ఒక ప్రభంజనమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Updated : 18 Jan 2024 13:13 IST

విజయవాడ: నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని.. ఒక ప్రభంజనమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

‘‘ఎన్టీఆర్‌ తెలుగు కళామతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అనే పదానికి మారుపేరు ఆయనది. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నారంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు’’ అని అన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని