AP Politics: అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్‌ చర్చలు

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దిల్లీ చేరుకున్నారు.

Updated : 07 Mar 2024 22:46 IST

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పొత్తులపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. భాజపాతో పొత్తుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అమిత్‌షాను కలిశారు. దానికి కొనసాగింపుగా మరోసారి భేటీ అయ్యారు. పొత్తులపై శుక్రవారంలోగా స్పష్టత వస్తుందని తెదేపా, జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని