శశిథరూర్‌పై అనర్హత వేటు వేయండి 

దేశంలో విజృంభిస్తోన్న బి.1.627 కరోనా రకంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై అనర్హత వేటు వేయాలని భాజపా ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్‌ చేశారు.

Published : 26 May 2021 01:10 IST

స్పీకర్‌కు లేఖ రాసిన భాజపా ఎంపీ

దిల్లీ: దేశంలో విజృంభిస్తోన్న బి.1.627 కరోనా రకంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై అనర్హత వేటు వేయాలని భాజపా ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థే బి.1.617 రకం అని చెబుతుంటే.. దౌత్యపరంగా ఎంతో అనుభవం ఉన్న ఎంపీ శశిథరూర్‌ మాత్రం ‘భారత వేరియంట్‌’గా పిలుస్తున్నారని దుబే ఆరోపించారు.  

‘‘కరోనా రకంపై ఎంపీ అశాస్త్రీయ పదజాలం ప్రయోగిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు భారతీయులను అవమానించేలా ఉన్నాయి. ఆ పదాన్ని(భారత వేరియంట్‌ను ఉద్దేశిస్తూ) తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని సోషల్‌మీడియా సంస్థలకు లేఖ రాసింది. అయినప్పటికీ ఒక లోక్‌సభ సభ్యుడు ఆ పదాన్ని ఉపయోగిస్తుండటం దేశానికి, దేశ ప్రజలకు సిగ్గుచేటు’’అని దుబే లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులను పార్లమెంట్‌ సభ్యులుగా కొనసాగించడం, పార్లమెంటరీ కమిటీలకు ఛైరపర్సన్‌గా ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆరోపించారు. ఆయనపై వెంటనే అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని