శశిథరూర్పై అనర్హత వేటు వేయండి
దేశంలో విజృంభిస్తోన్న బి.1.627 కరోనా రకంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై అనర్హత వేటు వేయాలని భాజపా ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు.
స్పీకర్కు లేఖ రాసిన భాజపా ఎంపీ
దిల్లీ: దేశంలో విజృంభిస్తోన్న బి.1.627 కరోనా రకంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై అనర్హత వేటు వేయాలని భాజపా ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు ఆయన లేఖ రాశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థే బి.1.617 రకం అని చెబుతుంటే.. దౌత్యపరంగా ఎంతో అనుభవం ఉన్న ఎంపీ శశిథరూర్ మాత్రం ‘భారత వేరియంట్’గా పిలుస్తున్నారని దుబే ఆరోపించారు.
‘‘కరోనా రకంపై ఎంపీ అశాస్త్రీయ పదజాలం ప్రయోగిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు భారతీయులను అవమానించేలా ఉన్నాయి. ఆ పదాన్ని(భారత వేరియంట్ను ఉద్దేశిస్తూ) తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని సోషల్మీడియా సంస్థలకు లేఖ రాసింది. అయినప్పటికీ ఒక లోక్సభ సభ్యుడు ఆ పదాన్ని ఉపయోగిస్తుండటం దేశానికి, దేశ ప్రజలకు సిగ్గుచేటు’’అని దుబే లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులను పార్లమెంట్ సభ్యులుగా కొనసాగించడం, పార్లమెంటరీ కమిటీలకు ఛైరపర్సన్గా ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆరోపించారు. ఆయనపై వెంటనే అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ