సొంతపార్టీ కార్యకర్తలపై పోలీసులకు డీఎంకే ఫిర్యాదు!

చెన్నైలో అమ్మా క్యాంటీన్‌ బోర్డులు తొలగించిన సొంత పార్టీల కార్యకర్తలపై డీఎంకే వేటువేసింది. అలాగే వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంక......

Published : 05 May 2021 02:25 IST

చెన్నై: చెన్నైలో అమ్మ క్యాంటీన్‌ బోర్డులు తొలగించిన సొంత పార్టీల కార్యకర్తలపై డీఎంకే వేటువేసింది. అలాగే వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంలో కొందరు కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ  అన్నాడీఎంకే దివంగత నాయకురాలు, మాజీ సీఎం జయలలిత ఫొటోతో ఉన్న  క్యాంటీన్ల బోర్డులను తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం స్టాలిన్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డీఎంకే సీనియర్‌ నేత, చెన్నై మాజీ మేయర్‌ సుబ్రమణియన్‌ను  స్టాలిన్‌ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్న సుబ్రమణియన్‌.. వారికి పార్టీలో ఎలాంటి పదవులు లేవని తెలిపారు. అలాగే క్యాంటీన్‌ బోర్డులను తిరిగి వాటి స్థానంలో ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని