‘చాలు మమతా జీ.. బెంగాల్ మార్పు కోరుతోంది’
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య కొనసాగుతున్న తీవ్ర మాటల యుద్ధంతో .....
టీఎంసీపై నడ్డా మాటల దాడి
కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్, భాజపాల మధ్య కొనసాగుతున్న తీవ్ర మాటల యుద్ధంతో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అభివృద్ధి సంస్కృతికి పేరుగాంచిన బెంగాల్ను మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు నాశనం చేశాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. నదియాలో మంగళవారం ఆయన పరివర్తన్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. నదియాలో తాము పరివర్తన్ ర్యాలీ ప్రారంభించామని, దీనిద్వారా ప్రజలని ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. బెంగాల్ ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారన్నారు. ‘ఇక చాలు మమతా జీ.. ప్రజలకు మార్పు కావాలి’’ అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో భాజపాదే విజయమన్నారు. ఇటీవల హల్దియాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మమతా బెనర్జీ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవడంలేదంటూ ప్రకటించిన విషయాన్ని నడ్డా ప్రస్తావించారు. మోదీ బెంగాల్కు వస్తారని, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకొస్తారని చెప్పారు. మరోవైపు, భాజపాపై చేపట్టిన రథయాత్రను ఐదు నక్షత్రాల బస్సుతో పోల్చిన మమత.. ఇది బయటి వ్యక్తులు రాష్ట్రాన్ని సందర్శించేందుకు ఉపయోగపడుతోందంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..