Vishnuvardhan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విష్ణువర్ధన్‌ రెడ్డి

పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

Published : 31 Oct 2023 00:03 IST

హైదరాబాద్‌: పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. కాంగ్రెస్‌ రెండో విడత జాబితాలో జూబ్లీహిల్స్‌ టికెట్‌ వస్తుందని విష్ణువర్ధన్‌రెడ్డి ఆశించగా ఆయనకు లభించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై చర్చించి.. కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇక ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌తో విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఈనేపథ్యంలో విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంటికి మంత్రి హరీశ్‌రావు సోమవారం వెళ్లి సమావేశమయ్యారు. ఆయనను భారాసలోకి ఆహ్వానించారు. ఒకట్రెండు రోజుల్లో విష్ణువర్ధన్‌రెడ్డి భారాసలో చేరనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని