కొత్త పార్టీ పెట్టాలా? వద్దా?.. సమాలోచనలు చేస్తున్నా: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు.

Published : 09 May 2022 01:54 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి ఫాంహౌస్‌కు వెళ్లి ఆయన్ను కలిసినట్లు విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు.

‘‘రాజగోపాల్‌రెడ్డిని మినహా ఇతర కాంగ్రెస్‌ నేతలను కలవలేదు. రేవంత్‌ రెడ్డిని కలిసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ప్రస్తుతం తటస్థంగా ఉంటున్నా. కాంగ్రెస్‌, భాజపాలోకి రావాలని ఆహ్వానాలున్నాయి. తెరాసను ఎదుర్కొనే పార్టీలోకి వెళ్లాలా? కొత్తగా పార్టీ పెట్టాలా? అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నా’’ అని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని