YSRCP: 16న వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఈనెల 16న విడుదల చేయనున్నట్టు వైకాపా ప్రకటించింది.
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఈనెల 16న విడుదల చేయనున్నట్టు వైకాపా ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సమన్వయకర్తల పేరుతో వైకాపా 12 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తుది జాబితా సిద్ధమైన నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో సీఎం జగన్ ఉన్నారు. నగరి, సత్తెనపల్లి, నసరావుపేట తదితర నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో స్థానిక నేతలతో చర్చిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.