Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Updated : 13 Jun 2023 12:41 IST

హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దయాకర్‌రెడ్డి మూడు సార్లు తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు, మక్తల్‌ నుంచి ఒకసారి గెలుపొందారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్‌రెడ్డి పనిచేశారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పరకాపురం. 

చంద్రబాబు సహా పలువురు ప్రముఖల సంతాపం

దయాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. సమర్థుడైన నాయకుడిగా దయాకర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. మంచి మిత్రుడిని కోల్పోయానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని