Pawan Kalyan: భీమవరం వదులుకోను.. నాదే : పవన్‌ కల్యాణ్‌

రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది.. బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు.

Updated : 13 Mar 2024 17:54 IST

మంగళగిరి: రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది.. బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ మాట్లాడారు.

‘‘రామాంజనేయులు చేరిక జనసేనకు చాలా కీలకం. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారారు. గతంలో నేను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్నిచ్చింది.  భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి.. అలయెన్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారాడు. కుబేరులు ఉండే భీమవరం పట్టణం ఒక రౌడీ చేతులో బందీ అయింది. ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం, వర్గంపై పడుతుంది. యుద్ధం తాలూకూ అంతిమ లక్ష్యం.. ప్రభుత్వాన్ని మార్చేలా చేయడం. జగన్‌కు ఆ యుద్ధం ఇద్దాం’’

‘‘దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పు అవుతుంది. జగన్‌ తాలూకూ జలగలను తీసిపారేయాలి.. భీమవరంలో ఉండే జలగతో సహా వీధిరౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వస్తుందో అర్థం చేసుకోవాలి. పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకు వచ్చా. భీమవరం వదలను.. నాది. అక్కడి నుంచి రౌడీయిజం పోవాలి. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్‌ యార్డ్‌ను సరిచేస్తాం. మే 15లోపు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ అవుతుంది. సిద్ధం.. సిద్ధం అని కోకిలలా కూస్తోన్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని