Loksabha Polls: ఆ లెక్కలు తేలితే.. మొదటి పేరు గడ్కరీదే: ఫడణవీస్
లోక్సభ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో అధికార ‘మహాకూటమి’ అభ్యర్థుల్లో మొదటి పేరు నితిన్ గడ్కరీదే వస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
ముంబయి: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సంబంధించి మహారాష్ట్రలో అధికార ‘మహాకూటమి’ పక్షాల మధ్య ఒక్కసారి సీట్ల పంపిణీ ఖరారయితే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేరే మొదట వస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. భాజపాకు రాజీనామా చేసి వస్తే.. ‘మహావికాస్ అఘాడీ’ తరఫున పోటీకి గడ్కరీకి అవకాశం కల్పిస్తామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఫడణవీస్ ఈమేరకు స్పందించారు. ఠాక్రే ప్రకటనను తోసిపుచ్చుతూ.. గడ్కరీ వంటి జాతీయ నేతకు అటువంటివారు ఆఫర్ ఇవ్వడమంటే.. అమెరికాకు అధ్యక్షుడిగా చేస్తానంటూ ఒక సాదాసీదా వ్యక్తి మరొకరికి హామీ ఇవ్వడం లాంటిదేనని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
‘‘రాష్ట్రంలో అధికార మహాకూటమి తన ఎంపీ సీట్ల పంపకాన్ని పూర్తి చేసిన అనంతరం.. అభ్యర్థుల్లో నితిన్ గడ్కరీ పేరే మొదట వస్తుంది. ఆయన మా ప్రముఖ నేత. నాగ్పుర్ నుంచే పోటీ చేస్తారు. ఇటీవల భాజపా మొదటి జాబితా విడుదలైన సమయంలో అధికార పక్షాల (భాజపా, శివసేన, ఎన్సీపీ) మధ్య ఎటువంటి చర్చలు జరగలేదు’’ అని మీడియాతో ఫడణవీస్ తెలిపారు. ఠాక్రే సొంత పార్టీయే చితికిపోయిందని విమర్శించారు. ఇదిలాఉండగా.. ‘‘గడ్కరీ దిల్లీ ముందు తలవంచే బదులు రాజీనామా చేయాలని, ఆయన్ను అఘాడీ అభ్యర్థిగా నిలబెడతాం’’ అని ఇటీవల ఓ సభలో ఉద్ధవ్ మాట్లాడారు. ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్