అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జగన్ ప్రయత్నం
జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. పాలన వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవాస్తవాలను...
తెదేపా ఎంపీ కనకమేడల
దిల్లీ: జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. పాలన వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవాస్తవాలను పదేపదే చెప్పి వాస్తవాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైకాపా ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. తెదేపా నేతలెవరూ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడలేదు. వైకాపా నేతలు వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారు’’ అని కనకమేడల విమర్శించారు.
ఇన్సైడర్ ట్రేడింగ్పై గురువారం వైకాపా నేతలు ఇచ్చిన ప్రజెంటేషన్పై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కనకమేడల చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై ఏ రైతు అయినా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ప్రజల ముందు వాస్తవాలను బయటపెట్టడానికి వైకాపా నేతలు ఎందుకు జంకుతున్నారని అన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై విమర్శలు చేయడం దారుణమన్నారు.
రాజధాని ప్రకటనకు ముందు దొనకొండ వద్ద భూ లావాదేవీలను బయటపెట్టాలని కనకమేడల డిమాండ్ చేశారు. విశాఖ, భీమిలిలో గత 6 నెలల్లో జరిగిన లావాదేవాలను ప్రకటించాలన్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసం క్విడ్ ప్రోకో ద్వారానే ఏర్పాటైందని, రాజధాని మార్పుపై కోర్టు కెళ్తే.. రూ లక్షల కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ విధానాన్ని నివేదిక రూపంలో ఇవ్వడానికి కమిటీలు వేయడం ఎందుకని కనకమేడల నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్