ఛైర్మన్ను చంద్రబాబు ప్రభావితం చేశారు:బుగ్గన
ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే దుర్దినం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
అమరావతి: ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదో దుర్దినం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం, చట్టసభలపై ఏమాత్రం గౌరవం లేకుండా సభలో తెదేపా వ్యవహరించిందన్నారు. మండలి గ్యాలరీల్లో తెదేపా అధినేత చంద్రబాబు కూర్చొని ఛైర్మన్ షరీఫ్ను ప్రభావితం చేశారని బుగ్గన ఆరోపించారు. ఛైర్మన్పై ఒత్తిడి తెచ్చి సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశారని మండిపడ్డారు.
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం తాపత్రయ పడ్డారని, 13 జిల్లాలను జోన్ల వారీగా అభివృద్ధి చేసేందుకు వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చామని బుగ్గన అన్నారు. ఎంతో మథనం, ఎన్నో కమిటీల అధ్యయనం తర్వాత అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శాసనసభ నుంచి మండలికి ఆమోదం కోసం పంపితే తొలి నుంచీ తెదేపా నేతలు అడ్డుతగిలారన్నారు. స్పీకర్గా,
మంత్రిగా పనిచేసిన యనమల నిబంధనలకు వ్యతిరేకంగా బిల్లులను పాస్ కానీ రిజక్ట్ గానీ చేయకుండా సెలెక్ట్ కమిటీ పంపారని బుగ్గన అన్నారు. బిల్లులను తిరిగి అసెంబ్లీకి పంపకూడదనే దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించారన్నారు. ఇంతటి అధ్వాన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇది చాలా అన్యాయమన్నారు. బిల్లు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పాలే తప్ప.. పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత