‘కేంద్ర నిధులపై కేసీఆర్వి పచ్చి అబద్ధాలు’
కేంద్రం నిధులపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు పచ్చి అబద్ధాలు చెప్పారని.. ఆ విషయం లోక్సభ సాక్షిగా బహిర్గతం అయిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ ఆరేళ్లలో వివిధ పథకాలకు...
భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు
దిల్లీ: కేంద్రం నిధులపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు పచ్చి అబద్ధాలు చెప్పారని.. ఆ విషయం లోక్సభ సాక్షిగా బహిర్గతం అయిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ ఆరేళ్లలో వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.52లక్షల కోట్ల నిధులు తెలంగాణకు ఇచ్చిందని చెప్పారు. తెలంగాణకు ఈ ఆరేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లోక్సభలో ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని చెప్పే సీఎం.. ఈ ప్రకటనతో సిగ్గు పడాలన్నారు. కేంద్రం ఏటా రాష్ట్రానికి రూ.50వేల కోట్లు ఇస్తోందన్నారు. మహిళలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అని చెప్పి కేసీఆర్ మోసం చేశారని అర్వింద్ ఆరోపించారు. జాతీయ మీడియా కథనం ప్రకారం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.70వేల కోట్ల రుణం తీసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని..
కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..