కమల్నాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
మధ్యప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కమల్నాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని.....
భోపాల్: మధ్యప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కమల్నాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆదివారం తెలిపారు. కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల ఎమ్మెల్యేలను అపహరించారని భాజపాపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించగా.. ఆ ఆరోపణలను ఆ పార్టీ ఖండించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో అంతర్గత పోరే ఇందుకు కారణమని విమర్శించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘‘భాజపాకు పన్నిన కుట్ర భగ్నమైంది. త్వరలో కేబినెట్ను విస్తరించనున్నాం’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు.
మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 114 స్థానాలు మాత్రమే గెలిచింది. దీంతో ఇద్దరు బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సహా నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో సహకారంతో కమల్నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రస్తుతం సీఎం కమల్నాథ్తో కలిపి 29 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి కేబినెట్లోకి చోటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ దశలో కేబినెట్ విస్తరణ కమల్నాథ్కు కత్తిమీద సామేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు భాగస్వామ్య పక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడం అంత సులువు కాదని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..