
తెదేపా కేంద్ర కార్యాలయం మూసివేత
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయాన్ని మూసివేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో), ప్రధాని మోదీ సూచనల మేరకు ఎన్టీఆర్ భవన్కు సందర్శకులు, కార్యకర్తలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కార్యకర్తలు కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఏదైనా సమాచారం ఉంటే వాట్సాప్, ఫోన్ల ద్వారా అందించాలని సూచించారు. కార్యాలయ సిబ్బంది కూడా ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం తెదేపా ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతుందని చంద్రబాబు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.