UP Politics: తెరపైకి పరశు‘రామ’ మంత్రం!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర్ప్రదేశ్లోని
బ్రాహ్మణ ఓటర్లకు కమలనాథుల వల
ఈనాడు, లఖ్నవూ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర్ప్రదేశ్లోని రాజకీయ పార్టీలకు పురాణ పురుషుడైన పరశురాముడు సహాయం అవసరమైంది. శ్రీరాముడిని నిత్యం స్మరించే భాజపా వ్యూహాత్మకంగా పరశురాముడిని తెరపైకి తీసుకొచ్చింది. తొలుత ఈ ఎత్తుగడను సమాజ్వాదీ పార్టీ వేసింది. ఆ పార్టీ గతంలోనే గోసాయిగంజ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ రహదారి పక్కన పరశురాముని ఆలయం నిర్మించింది. దీంతో పలువురు సీనియర్ బ్రాహ్మణనేతలు ఎస్పీ వైపు మొగ్గుచూపడం లేదా ఆ పార్టీలోకి వలస వెళ్లడాన్ని భాజపా నాయకత్వం గ్రహించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇదే అంశంపై దిల్లీలో పార్టీకి చెందిన బ్రాహ్మణ నేతలు, కొందరు మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కమలంపై బ్రాహ్మణుల అసంతృప్తి, ఆగ్రహం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. నష్టనివారణ కోసం సత్వరమే ఏమైనా చేయాలన్న నిర్ణయంలో భాగంగా లఖ్నవూలోని కృష్ణానగర్లో 11 అడుగుల ఎత్తైన పరశు రాముడి విగ్రహాన్ని భాజపా బ్రాహ్మణనేత, ఉప ముఖ్యమంత్రి దినేశ్శర్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రి బ్రిజేష్పాఠక్, ఎంపీ రీటా బహుగుణ జోషి పాల్గొన్నారు.
* రాష్ట్రంలో బీసీ, దళిత, ముస్లిం వర్గాల తరువాత చాలా రాజకీయ పార్టీల దృష్టి బ్రాహ్మణ ఓటర్లపైనే ఉంది. యూపీలో వారి జనాభా 12శాతం కంటే ఎక్కువ. అయితే, బ్రాహ్మణ ఓటర్లు 15శాతానికి పైగా ఉన్న నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలా కనిపిస్తాయి. భాజపా పరశురాముని విగ్రహస్థాపనపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. యోగి పాలనపై ఆగ్రహంతో ఉన్న బ్రాహ్మణులను బుజ్జగించి ఆకట్టుకునేందుకు భాజపా ఈ నాటకం ఆడుతోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్