Andhra News: ప్రొద్దుటూరు మున్సిపల్‌ మీటింగ్‌లో వైకాపా కౌన్సిలర్ల వీరంగం

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో వైకాపా కౌన్సిలర్లు వీరంగం సృష్టించారు.

Updated : 31 Mar 2022 16:07 IST

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో వైకాపా కౌన్సిలర్లు వీరంగం సృష్టించారు. సమావేశం మధ్యలో ఒకరినొకరు నెట్టుకున్నారు. 13వ వార్డులో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ ఆరోపించగా.. వైస్‌ ఛైర్మన్‌ ఖాజా మొహియుద్దీన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘర్షణ జరిగి కౌన్సిలర్ల మధ్య తోపులాటకు దారితీసింది. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని