ఇది రాష్ట్ర చరిత్రలో గుర్తుండిపోయే రోజు
ఆంధ్రప్రదేశ్, యువత భవిష్యత్తు కోసమే నారా లోకేశ్ యువగళం పేరుతో తొలి అడుగు వేశారని, రాష్ట్ర చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
యువగళం సభలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్నెన్నాయుడు
ఈనాడు, తిరుపతి: ఆంధ్రప్రదేశ్, యువత భవిష్యత్తు కోసమే నారా లోకేశ్ యువగళం పేరుతో తొలి అడుగు వేశారని, రాష్ట్ర చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కుప్పంలో నిర్వహించిన యువగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ...
‘రాష్ట్ర ప్రజలు అన్యాయానికి, అక్రమాలకు గురవుతుంటే చూసి తట్టుకోలేకనే ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కొంత మెత్తగా ఉంటారు లోకేశ్ మాత్రం అలా కాదు. అవినీతిపరుల తాట తీస్తారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు. జగన్పై అలుపెరగకుండా మనం చేస్తున్న పోరాటం అంతిమ దశకు చేరుకుంది. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో తెదేపా 160 స్థానాల్లో విజయం సాధిస్తుంది’ అని ధీమా వ్యక్తంచేశారు.
ప్రజల సమస్యలు తెలుసుకుంటాం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండేది. అప్పుడు ఆయన యాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారు. అదే బాటలో చంద్రబాబు పాదయాత్ర చేసి... ప్రజా సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయ్యారు. నేడు అంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి.
చినరాజప్ప, మాజీ మంత్రి
నవశకం ప్రారంభం
యువగళం పాదయాత్ర ద్వారా కుప్పంలో నవశకం ప్రారంభమైంది. నాలుగేళ్లుగా వైకాపా పాలనలో అరాచకాలు జరుగుతున్నాయి. చంద్రబాబు వస్తేనే వీటికి అడ్డుకట్ట పడతాయి. యువగళం ద్వారా వైకాపాను ఇంటికి పంపిస్తాం.
అమరనాథ్రెడ్డి, మాజీ మంత్రి
జగన్వి ఫ్యాక్షన్ రాజకీయాలు
జగన్వన్నీ ఫ్యాక్షన్ రాజకీయాలు. లోకేశ్ చరిత్ర ఎంతో ఉన్నతమైంది. ఆయన చిన్నప్పుడే తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అటువంటి లోకేశ్తో జగన్కు పోలిక లేదు.
ప్రతిభా భారతి, మాజీ స్పీకర్
వారిది గడప గడపకు వెళ్లలేని పరిస్థితి
రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. తాము గడప గడపకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని స్వయంగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. వైకాపాను రాష్ట్రం నుంచి తరిమివేయాలి. అప్పుల పాలన చేస్తున్న జగన్ను గద్దె దించాలి.
నిమ్మల కిష్టప్ప, మాజీ ఎంపీ
కొత్త ఉద్యోగాలు లేవు... జీతాలూ ఇవ్వట్లేదు
జగన్ వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగులకు జీతాలూ ఇవ్వట్లేదు. అమ్మఒడి వస్తుందన్న ఆనందం కంటే ఉద్యోగం రాక యువత మానసికంగా కుంగిపోతోందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. జగన్ మోహన్రెడ్డి... అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక లోకేశ్పై 14 కేసులు పెట్టారు. యువగళంపై భయంతోనే 15 షరతులు విధించారు.
వంగలపూడి అనిత, తెలుగు మహిళ అధ్యక్షురాలు
పోలీసులు, రౌడీలు కలిసిపోయారు
పోలీసులు, రౌడీలు కలిసి దుర్మార్గాలు చేస్తున్నారు. రౌడీలను ఎదుర్కొనేందుకు గుండెలు అడ్డు పెట్టి లోకేశ్ వస్తున్నారు. ఈ పాదయాత్రతో వైకాపా ఇంటికి వెళ్లడం ఖాయం. సీˆఎం బయటకు రావాలంటే దుకాణాలు మూయాలి. పరదాలు కట్టాలి. ఆయనకు జనం మధ్యకు వచ్చే దమ్ము లేదు. ఎన్నికలు వస్తే ప్రస్తుత, మాజీ మంత్రుల్లో 32 మంది ఓడిపోతారు.
సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, మాజీ మంత్రి
నిలబడతాం... కలబడతాం
లోకేశ్ పాదయాత్రతో తెదేపాలో స్వరం, తరం మారుతోంది. ఇది యువగళం తెస్తున్న మార్పు. పోరాటానికి రాష్ట్ర యువతరం సిద్ధపడింది. ప్రజల సంక్షేమం కోసం నిలబడతాం... అవసరమైతే కలబడతాం. వారికి భద్రత కల్పించేందుకు కృషి చేస్తాం. లోకేశ్... పాదయాత్ర సందర్భంగా ఇబ్బందులు పెడతారు ఓర్చుకో... మంచి మాటలు నేర్చుకో... రాళ్లు వేస్తారు వాటిని మెట్లుగా మార్చుకో.
పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ