పోలీసుల సొమ్మును జగన్ ప్రభుత్వం దోచుకుంది
పోలీసులు దాచుకున్న రూ.800 కోట్ల పీఎఫ్ సొమ్మును వైకాపా సర్కారు దోచుకుంటే.. దాని గురించి పట్టించుకోకుండా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెదేపా వాళ్లని తిట్టడమేమిటని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు
ఈనాడు డిజిటల్, అమరావతి: పోలీసులు దాచుకున్న రూ.800 కోట్ల పీఎఫ్ సొమ్మును వైకాపా సర్కారు దోచుకుంటే.. దాని గురించి పట్టించుకోకుండా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెదేపా వాళ్లని తిట్టడమేమిటని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. పోలీసుశాఖలో ఉన్న కొందరు పై స్థాయి అధికారులు జగన్రెడ్డి చెప్పిందల్లా చేస్తూ తప్పుడు నిర్ణయాలతో మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో 75వేల మంది ఉండాల్సిన పోలీసులు 60వేల మందే ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన దాని కంటే తక్కువ పోలీసులున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. గంజాయి, నాటు సారా వ్యాపారాలు, దొంగతనాలు, దోపిడీలు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. ఉన్నవారి మీద పని ఒత్తిడి పెరిగింది. ఇప్పటి వరకూ ఎంత మంది హోంగార్డులను క్రమబద్థీకరించారు? తెలంగాణలో వారికి రూ.30వేల కంటే ఎక్కువ ఇస్తుంటే ఏపీలో రూ.21వేలే ఇస్తున్నారు. ఇవన్నీ పోలీసులను మోసం చేయడం కాదా? వీటి గురించి అసోసియేషన్ ప్రతినిధులు, ఆ శాఖ పెద్దలు మాట్లాడరా’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!