రాజకీయ అస్త్రాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు: కేకే
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ అస్త్రాలుగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేసేందుకే అవి పనిచేస్తున్నాయని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆరోపించారు.
ఈనాడు, దిల్లీ: సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ అస్త్రాలుగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేసేందుకే అవి పనిచేస్తున్నాయని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆరోపించారు. హిండెన్బర్గ్ నివేదికపై చర్చించాలంటూ పార్లమెంటు ఉభయ సభల్లో భారాస ఎంపీలు శుక్రవారం వాయిదా తీర్మానాల నోటీసులివ్వగా.. సభాపతులు వాటిని తోసిపుచ్చారు. అనంతరం కేశవరావు విలేకరులతో మాట్లాడారు. హిండెన్బర్గ్ నివేదిక పేర్కొన్నట్టు అదానీ వ్యవహారాన్ని మించిన పెద్ద కుంభకోణం ఈ శతాబ్దంలోనే లేదన్నారు. అదానీ తీరుతో దేశ ప్రతిష్ఠ మంటగలిసిపోతోందని విమర్శించారు. భారాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీ కంపెనీల అవకతవకలతో పేదలపై పెనుభారం పడుతోందన్నారు. అదానీ అంశంపై ఉభయసభల్లో చర్చ కోరితే కేంద్రం వెనుకడుగు వేస్తోందని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?