ఉర్దూ తర్జుమాలోకి ప్రధాని ‘మన్ కీ బాత్’
వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల కసరత్తుపై దృష్టి సారించిన భాజపా జనాభాపరంగా భారత్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లో ముస్లిం మైనార్టీలను మెప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది.
యూపీ మదరసాల్లో పంపిణీకి భాజపా యోచన
లఖ్నవూ: వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల కసరత్తుపై దృష్టి సారించిన భాజపా జనాభాపరంగా భారత్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లో ముస్లిం మైనార్టీలను మెప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే రేడియో కార్యక్రమం అయిన ‘మన్ కీ బాత్’ను ఉర్దూలోకి తర్జుమా చేయించి ఆ సంకలనాలను రాష్ట్రంలోని మదరసాలు, ఇస్లామిక్ పండితులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2022 ఏడాది మొత్తం జరిగిన ప్రధాని ‘మన్ కీ బాత్’ ప్రసంగాల సంకలనాన్ని రాష్ట్ర భాజపా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలి ఆధ్వర్యంలో 12 ఎపిసోడ్లుగా మేరఠ్కు చెందిన తబిష్ ఫరీద్ ఉర్దూలోకి అనువదించారు. రంజాన్ నెలలో ఈ పుస్తకాన్ని లక్షమంది ప్రజలకు చేరువ చేయడమే తమ లక్ష్యమని బాసిత్ అలి తెలిపారు. రాష్ట్రంలోని పాస్మాందా ముస్లింలతో సమావేశాలు ఏర్పాటుచేసి.. పశ్చిమ యూపీలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో ‘వన్ కంట్రీ - వన్ డీఎన్ఏ’ పేరిట స్నేహ్ మిలన్ సదస్సులను సైతం ఏర్పాటుచేయాలని భాజపా వ్యూహరచన చేస్తోంది.
ఓట్ల కోసం ఉర్దూ జపం : అఖిలేశ్ యాదవ్
విద్వేషంతో కూడిన విషాన్ని చిమ్మి ముస్లిం సోదరులను అవమానించిన భాజపా ఇపుడు ఓట్ల కోసం ఉర్దూ జపం చేస్తోందని యూపీ మాచ్కీజీజి ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేస్తూ.. భారతీయ భాష ఉర్దూ ప్రేమను నేర్పుతుందని, గంగా - జమునా సంస్కృతిని పెంచుతుందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్