ప్రజలకు కాంగ్రెస్ టోపీ
ఎన్నికల సందర్భంగా ‘గ్యారంటీ’ పేరిట హామీలను ప్రకటించే కాంగ్రెస్.. ఆ తర్వాత అవన్నీ మరిచిపోతుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ ధ్వజం
ఈనాడు, బెంగళూరు: ఎన్నికల సందర్భంగా ‘గ్యారంటీ’ పేరిట హామీలను ప్రకటించే కాంగ్రెస్.. ఆ తర్వాత అవన్నీ మరిచిపోతుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. శనివారం ఆయన కర్ణాటకలోని బెంగళూరు, చిక్కబళ్లాపుర, దావణగెరెలలో పర్యటించారు. ఈ సందర్భంగా దావణగెరెలో నిర్వహించిన ‘మహాసంగమ’ సభలో మాట్లాడారు. ఇటీవల హిమాచల్ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా గ్యారంటీ పథకాలు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టారని ప్రధాని ఆరోపించారు. ఫలితాలు వెల్లడై అధికారం చేపట్టి 3నెలలు దాటినా ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నోరు మెదపటం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోనూ ఇదే తరహా హామీలతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. ఆర్థికంగా దూసుకెళుతున్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఏటీఎంగా మార్చుకుంటుందని విమర్శించారు. విజయానికి ఆరాటపడుతున్న కాంగ్రెస్ తనకు సమాధి కట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. మోదీ కమలంలా వికసిస్తాడని అన్నారు. రానున్న కర్ణాటక ఎన్నికల్లో భాజపాకు సంపూర్ణ ఆధిక్యాన్ని ఇవ్వాలని కోరారు. దావణగెరె హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి ప్రధాని వచ్చే సమయంలో ఓ వ్యక్తి ఆ మార్గంలోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసంకల్పితంగానే వ్యక్తి వచ్చారని, భద్రత లోపం కారణం కాదని పోలీసులు తెలిపారు.
సత్యసాయి సేవలు స్ఫూర్తిదాయకం
సత్యసాయిబాబా తన సేవలతో స్ఫూర్తి నింపారని ప్రధాని కొనియాడారు. చిక్కబళ్లాపుర సమీపంలోని సత్యసాయిగ్రామ్ శివారులో నిర్మించిన ఎస్ఎంఎస్ఐఎంఎస్ఆర్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అంతకుముందు దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడుతూ ఆధ్యాత్మికం, ప్రజాసంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో సత్యసాయి సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, ప్రాంతీయ భాషలో వైద్య కోర్సులవంటి చర్యలతో దేశంలో ప్రజారోగ్యం మెరుగుపడిందని వివరించారు. ఈ పర్యటన సందర్భంగా బెంగళూరులో 13 కి.మీ.పొడవైన కే.ఆర్.పురం-వైట్ఫీల్డ్ మెట్రో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. రైలులో ప్రయాణించి విద్యార్థులు, కార్మికులతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
నౌక స్వాధీనం ఘటన.. భారత నావికుల్లో ఐదుగురికి ఇరాన్ విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్