ఎండైనా.. వానైనా.. అదే జోష్
మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు.. సాయంత్రం భారీ ఈదురుగాలులు, జోరువానతో గంటపాటు ఆందోళనకర వాతావరణం.
ఉదయం మండుటెండ.. సాయంత్రం భారీ వర్షం
అయినా శ్రేణుల్లో తగ్గని ఉత్సాహం
ఈనాడు, రాజమహేంద్రవరం: మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు.. సాయంత్రం భారీ ఈదురుగాలులు, జోరువానతో గంటపాటు ఆందోళనకర వాతావరణం. ఊహించని వాతావరణ మార్పులతో మహానాడుకు వచ్చిన తెదేపా కార్యకర్తల్లో కాసేపు గందరగోళం ఏర్పడింది. భారీ వర్షంలో ఏం చేయాలో తెలియక పలువురు తమ వాహనాల వద్దకు పరుగులు తీశారు. గంటలోనే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో బయటకు వెళ్లినవారంతా సభా ప్రాంగణంలోకి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
భానుడి భగభగలు..
తెల్లవారుజామునుంచే పలు ప్రాంతాలవారు రైళ్లు, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో తరలివచ్చారు. ఆదివారం రాజమహేంద్రవరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వారంతా స్థానిక నాయకులు, వాలంటీర్ల సూచన మేరకు శనివారం జరిగిన ప్రతినిధుల సభ ప్రాంగణంలో సేదదీరారు. అక్కడే భోజనం చేశారు. సాయంత్రం 4.30కు వాతావరణం ఒక్కసారిగా మారింది. భారీ ఈదురుగాలులకు మైదానంలోని ఎర్రమట్టి ఎగిసి కళ్లలో దుమ్ము పడింది. ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన భారీ కటౌట్లు.. ద్విచక్రవాహనాలు, కార్లపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఫ్లెక్సీలు, కుర్చీలను కొందరు తలకు రక్షణగా పెట్టుకున్నారు. సభా ప్రాంగణం పలుచోట్ల బురదమయమైంది.
చంద్రన్న కోసమే వచ్చాం..
వాన వెలిశాక తడిసిపోయారుగా మీ వాహనాల్లోనే ఉండొచ్చు కదా అని మహిళలను ప్రశ్నించగా.. తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ప్రసంగం వినడానికే వచ్చామని ఉత్సాహంగా చెప్పారు. వర్షం కారణంగా ఎల్ఈడీ తెరలు పనిచేయలేదు. దీంతో దూరంగా ఉన్నవారికి ప్రసంగిస్తున్న వక్తలను చూసేందుకు అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గలేదు. వర్షం పడేటప్పుడు ఇతర ప్రాంతాలనుంచి వాహనాల్లో వచ్చేవారు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో పోలీసులు ట్రాఫిక్పై దృష్టి పెట్టకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. కాసేపు చంద్రబాబు కాన్వాయ్ సైతం అందులోనే చిక్కుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ