పోలీసు భద్రత లేకుండా ప్రజల్లోకి రాలేరా?
సీఎం, మంత్రులు పోలీసు భద్రత లేకుండా స్వేచ్ఛగా ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
పెద్దకొత్తపల్లి, న్యూస్టుడే: సీఎం, మంత్రులు పోలీసు భద్రత లేకుండా స్వేచ్ఛగా ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వెనకా ముందు పోలీసు వాహనాలతో సైరన్ మోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమేంటన్నారు. మంగళవారం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో కొనసాగింది. చంద్రకల్లో విలేకరుల సమావేశంలో, రాత్రి పెద్దకొత్తపల్లిలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో భట్టి మాట్లాడారు. మంగళవారం మంత్రి హరీశ్రావు అచ్చంపేట పర్యటన సందర్భంగా ఎక్కడికక్కడ ప్రజలను అదుపులో తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలను నిషేధించారా? అని నిలదీశారు. మంత్రులు వచ్చేముందు ముందస్తు అరెస్టు చేయడమంటే.. ప్రజలను చూసి ఎంత భయపడుతున్నారో అర్థమవుతోందన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినా పెండింగ్ బిల్లుల కోసం భారాసలో చేరారన్నారు. ఇది క్విడ్ప్రోకో కిందకే వస్తుందని ఆరోపించారు. గ్రామాభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకుండా సర్పంచులను ప్రభుత్వం వేధిస్తోందని.. దీనిపై ఐక్యంగా పోరాడదామని భట్టి పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..