ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తాను కూడా అనుకుంటున్నట్టు కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత సుజనాచౌదరి వెల్లడించారు.
పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే
భాజపా నేత సుజనాచౌదరి
ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తాను కూడా అనుకుంటున్నట్టు కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత సుజనాచౌదరి వెల్లడించారు. ఇప్పటికీ జనసేన భాజపాతోనే కలిసి ఉందని, భవిష్యత్తులో మరో పార్టీ తమతో కలిసి పొత్తుకు వస్తుందా? లేదా? అన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి సుజనాచౌదరి మాట్లాడారు. తెదేపా, జనసేన, భాజపా పొత్తుపై కేంద్ర పెద్దలను ఒప్పిస్తానంటూ పవన్ వ్యాఖ్యానించారంటే.. అది ఆయన నమ్మకం అయి ఉండొచ్చన్నారు. ఏపీలో అరాచకాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, అంత మెజారిటీ వచ్చినా జగన్ ఎందుకు అధ్వానంగా పాలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వైకాపా వల్ల గత నాలుగేళ్లుగా రాజధాని ఏదో తెలియని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తెదేపా కోవర్టు అని వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై సుజనా స్పందిస్తూ.. ఆ మాట అంటున్న వారే సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనపై 50 లక్షల కరపత్రాలను ఈ నెల 20 నుంచి ఇంటింటికీ పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. భాజపాకు మద్దతు ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ 9090902024 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీకి కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు, నిధులపై బ్రోచర్ను.. సుజనా, సోము వీర్రాజు విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్