TDP: లోకేశ్కు చిన్న హాని జరిగినా జగన్దే బాధ్యత
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఏ చిన్న హాని జరిగినా సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని తెదేపా నేతలు స్పష్టం చేశారు.
వైకాపా గూండాలతో కుమ్మక్కైన పోలీసులు
గవర్నర్కు తెదేపా బృందం ఫిర్యాదు
ఈనాడు డిజిటల్, అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఏ చిన్న హాని జరిగినా సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని తెదేపా నేతలు స్పష్టం చేశారు. పాదయాత్రలోకి వైకాపా గూండాలు చొరబడి అల్లర్లు సృష్టిస్తుంటే.. పోలీసులు వారికి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్పై ప్రొద్దుటూరులో స్థానిక డీఎస్పీ, సీఐల సమక్షంలో కోడిగుడ్లతో దాడి జరిగినా వారు కనీసం స్పందించలేదని విమర్శించారు. రాయలసీమలో కొందరు వైకాపా ముఠా నాయకులు లోకేశ్ను అంతమొందిస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్ర సాగుతున్న గ్రామాల్లో చంద్రబాబు, లోకేశ్లను కించపరిచేలా వైకాపా నేతలు ఫ్లెక్సీలు కట్టి తెదేపా శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారని, ఘర్షణలకు పురిగొల్పుతున్నారని.. అయినా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సైకో సీఎం’ అని పది తలలు పెట్టి బ్యానర్లు కడతామని, అప్పుడు ఈ పోలీసులు, అధికారులు ఏం చేస్తారో చూస్తామని పేర్కొన్నారు. యువగళానికి మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ బృందం గురువారం రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ముస్లింలపై జరుగుతున్న దాడుల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 50 దాడుల వివరాల్ని ప్రస్తావిస్తూ లోకేశ్ రాసిన లేఖను గవర్నర్కు అందజేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.
వంద ముస్లిం కుటుంబాల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు
ముస్లింలపై దాడులు జరుగుతున్నా పోలీసులు కనీసం స్పందించడం లేదని, కేసులు నమోదు చేయడం లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. ‘ముస్లింలపై భౌతిక దాడులు పెరిగాయి. గురజాల మండలంలోని ఓ గ్రామంలో వంద ముస్లిం కుటుంబాల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు. పోలీసుల దగ్గరకి వెళితే భద్రత కల్పించలేమని వారు చేతులెత్తేశారు. తప్పుడు కేసు పెట్టడంతో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు’ అని షరీఫ్ పేర్కొన్నారు. గవర్నర్ అన్ని విషయాలు శ్రద్ధగా విన్నారని, ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్బాబు, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు