Komatireddy: నేడు 60-70 సీట్ల ఖరారు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణలోని 60-70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం జరిగే కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Updated : 08 Oct 2023 07:55 IST

ఈనాడు, దిల్లీ: తెలంగాణలోని 60-70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం జరిగే కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం రాత్రి కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌తో భేటీ అయిన తర్వాత విలేకర్లకు ఈ విషయం చెప్పారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని, అభ్యర్థులను ఖరారు చేస్తే వారంతా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని తాను మురళీధరన్‌కు చెప్పినట్లు వెల్లడించారు. భారాస మాదిరి ముందస్తుగా టికెట్లు ఖరారు చేయడం కాంగ్రెస్‌ లాంటి జాతీయపార్టీలో సాధ్యం కాదన్నారు. భారాస ప్రాంతీయ, కుటుంబ పార్టీ అయినందున ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని